Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. గీతా గోవిందంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పరుశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు.
ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే12న విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ను క్రియేట్ చేయగా.. మరిన్ని అంచనాలను పెంచేందుకు మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ అదరగొట్టేస్తుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజా సమచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 103 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసిందట. అలాగే దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఓవర్సీస్ ఇలా మొత్తంగా రూ. 175 కోట్ల మేర ఈ చిత్రానికి బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు. దీంతో `సర్కారు వారి పాట` క్లీన్ హిట్ అవ్వాలంటే రూ. 180 కోట్ల మేర వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.
మరి ఇంత పెద్ధ భారీ టార్గెట్ను మహేష్ రీచ్ అవుతాడో లేదో చూడాలి. కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీకి తమన్ స్వరాలు అందించారు.