Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు.
బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సముద్రఖని విలన్గా చేయగా.. మ్యూజిక్ సెన్షేషన్ తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, గ్లింప్స్, సాంగ్స్తో భారీ హైప్ను ఏర్పర్చుకున్న ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ను మే 7వ తేదీన హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా జరగబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. సర్కారు వారి పాటకు రన్ టైమ్ను లాక్ చేశారట.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ మూవీకి 163 నిమిషాల రన్ టైమ్ను సెట్ చేశారట మేకర్స్. అంటే దాదాపు 2 గంటల 43 నిమిషాలు. కంటెంట్లో దమ్ముంటే భారీ రన్ టైమ్ పెద్ద విషయం కాదు. ట్రైలర్ బట్టీ చూస్తే.. సర్కారు వారి పాటలో మంచి కంటెంట్తో పాటు కామెడీ, లవ్, యాక్షన్ పుష్కలంగా ఉండనుందని అర్థమైంది. ఈ నేపథ్యంలోనే రన్ కాస్త పెద్దగా ఉన్నా.. మహేష్ ఫ్యాన్స్కి పూనకాలు ఖాయమని అంటున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!