Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వేసవి కానుకగా మే 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ను దక్కించుకోగా.. నిన్న మేకర్స్ సెకెండ్ సింగిల్గా `పెన్నీ` సాంగ్ను బయటకు వదిలారు. ఇది విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి రెస్పాన్స్ను దక్కించుకుని యూట్యూబ్లో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సాంగ్ నయా రికార్డ్ను సెట్ చేసింది. అంతకు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన `కళావతి` పాటకి 24 గంటల్లో 14.78 మిలియన్స్ వ్యూస్ రాగా.. 22 గంటల్లోనే పెన్నీ సాంగ్ కి 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ను దక్కించుకుంది.
దీంతో ఫాస్టెస్ట్ 15 మిలియన్స్ వ్యూస్ అందుకున్న తొలి సాంగ్ కి టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేథప్యంలోనే మహేష్ ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కాగా, ఈ పెన్నీ వీడియో సాంగ్ ద్యారా మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని సిల్వర్ స్క్రీన్కి తొలిసారిగా పరిచయం అయింది. ఈ పాటలో తండ్రీ, కూతుళ్లు తమదైన స్టెప్పులతో అదరగొట్టేశారు.