SVP: సూపర్ స్టార్ మహేశ్ బాబు, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి `గోత గోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇందులో సముద్రఖని విలన్గా చేయగా.. నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూర్చారు. భారీ అంచనాల నడుమ గత నెల 12న విడుదలైన ఈ చిత్రం.. మొదట మిశ్రమ స్పందన దక్కించుకుంది. కానీ, ఆ తర్వాత మంచి టాక్తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ను రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజార్ ప్రైమ్ వీడియో సైతం చేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ సినిమా జూన్ 10 లేదా జూన్ 24న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా నేడే ఈ చిత్రం సైలెంట్గా ఓటీటీలోకి దిగిపోయింది. కానీ, ఇక్కడే అమెజార్ వారు ఓ ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే.. ఓటీటీ వేదికగా సర్కారు వారి పాటను వీక్షించాలంటే డబ్బు చల్లించాల్సిందే.
ఇటీవల విడుదల అయిన కేజీఎఫ్ 2 సినిమాను పే-పర్-వ్యూ పద్దతిలో ఓటీటీ నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అకౌంట్ హోల్టర్లకు అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇప్పుడు సర్కారు వారి పాటను కూడా పే-పర్-వ్యూ పద్దతిలోనే అమెజాన్ వారు అందుబాటులోకి తెచ్చారు. ఈ సినిమాను చూడాలంటే ఎవ్వరైనా రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది.