Naresh: ఇటీవల తెలుగు చలనచిత్రరంగ సమస్యలు గురించి చిరంజీవితో పాటు ప్రభాస్ మహేష్ కొరటాల శివ రాజమౌళి మరి కొంతమంది సినీ ప్రముఖులు భేటీ కావడం తెలిసిందే. సినిమా టికెట్ ధర గురించి ఇంకా షూటింగ్ రకరకాల వాటి గురించి.. సీఎం జగన్ తో క్యాంప్ ఆఫీస్ లో చర్చించడం జరిగింది. ఈ సమావేశం అనంతరం చిరంజీవి మరియు ఇతర హీరోలు జగన్ చాలా సానుకూలంగా ఇండస్ట్రీ సమస్యల పట్ల స్పందించినట్లు తెలియజేశారు. టైం ఇచ్చినందుకు అదేవిధంగా ఇండస్ట్రీ సమస్యల పై పూర్తి అవగాహన ముఖ్యమంత్రికి ఉందని రాజమౌళితో పాటు మహేష్ బాబు కూడా చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే సినీ ప్రముఖులతో సీఎం జగన్ భేటీపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు ఇండస్ట్రీలో చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ భేటీపై సీనియర్ యాక్టర్ నరేష్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ సంతోషం. కానీ తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి సమస్యలు పరిష్కారాలు ఇంకా అనేక విషయాలు అధికారికంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించబడిన టాలీవుడ్ పరిశ్రమ ఐక్యత ప్రతిబింబించే ఫిలిం ఛాంబర్ నేతృత్వంలో వర్క్ షాప్ అవసరం అని తెలియజేశారు.
త్వరలో ప్రభుత్వం ఈ విధంగా ముందుకు అడుగులు వేస్తుందని ఆశిస్తున్నట్లు నరేష్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక నరేష్ మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కొంతమంది కీలక వ్యక్తులు సీఎం జగన్ వద్ద టాలీవుడ్ సెలబ్రిటీలు వ్యవహరించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే చాలా సానుకూలమైన వాతావరణంలో ముఖ్యమంత్రితో అద్భుతంగా చిరంజీవి బృందం సమస్యల విషయంలో డీల్ చేస్తున్నట్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.