Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బెంగళూరు నుండి హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి తరలించడం జరిగింది. వెంటనే వైద్యులు స్పందించి.. చికిత్స అందించడం జరిగింది. కొన్ని గంటలపాటు ప్రజావ్యక్షణలో ఉంచగా ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ICU నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. 71 ఏళ్ల శరత్ బాబు గత కొంతకాలంగా కొలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల మరింతగా ఆరోగ్యం క్షీణించటంతో.. హాస్పిటల్ పాలు కావటం జరిగింది. శ్వాస సంబంధించి సమస్యలు తలెత్తడంతో.. తొలుత బెంగళూరులో చూపించగా తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో ఆరోగ్యం నిలకడగా ఉంది.
1973 వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు… తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇంక అనేక భాషల్లో సినిమాలు చేయడం జరిగింది. సహాయ నటుడిగా నటించి మూడు నంది అవార్డులు అందుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 250కి పైగా సినిమాలు చేయడం జరిగింది. నిజానికి ఆయన సినిమాల్లోకి రాకముందు పోలీస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయగా కళ్లద్దాలు ఉండటంతో… ఆ కోరిక నెరవేరలేదు. దీంతో తండ్రి వ్యాపారాలు చూసుకోవాలని తెలపడం జరిగింది. అయితే శరత్ బాబుకి మొదటి నుండి నటన రంగంపై ఆసక్తి ఎక్కువ. ఈ విషయాన్ని తల్లికి చెప్పి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి… అద్భుతమైన అవకాశాలు ప్రారంభంలోనే అందుకున్ని సక్సెస్ సాధించారు.
సినిమా రంగంతోపాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. అంత మాత్రమే కాదు సీరియల్ రంగంలో కూడా కీలకంగా రాణించటం జరిగింది. ఈటీవీలో “అంతరంగాలు” సీరియల్ లో శరత్ బాబు పాత్ర అప్పట్లో చాలా హైలైట్. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల ద్వారా గుర్తిండిపోయారు. 2021లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమాలో కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. అటువంటి శరత్ బాబుకి ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావటం.. హాస్పిటల్ పాలు కావటంతో అభిమానులు తల్లడిల్లిపోయారు. అయితే మరేమీ ప్రమాదం లేదని జనరల్ వార్డుకి తరలించటంతో ఊపిరి పీల్చుకున్నారు.