ఆల్ ఈజ్ వెల్.. ఆల్ ఈజ్ వెల్.. అని అనుకోమని గుండెకు చెబుతుంటాడు `త్రీ ఇడియట్స్ `లో హీరో. ఇప్పుడు ఎం.ఎస్.రాజు కూడా అదే పని చేస్తున్నారు. ప్రస్తుత జనాలకు దిల్రాజు ఎంత బాగా తెలుసో, ఒక జనరేషన్ ముందు వాళ్లకు ఎం.ఎస్.రాజు అంతకన్నా బాగా తెలుసు. స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగిన ఆయన దాదాపుగా `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` తర్వాత క్రమేణ తన వెలుగులను కోల్పోయారు. తానే దర్శకత్వం చేయడం, కథలు అందించడం, కొత్త దర్శకుల సినిమాలకు అన్నీ తానై వ్యవహరించడం… ఇలా ఎన్నో కారణాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తుంటాయి. ఆ తర్వాత కొన్నేళ్లు కొడుకు సుమంత్ అశ్విన్ను హీరోగా నిలబెట్టడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. సుమంత్ అశ్విన్ డీసెంట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో కాస్త కుదుటపడ్డ ఎం.ఎస్.రాజు తాజాగా మరో సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ తాజా సినిమాకు ఆయన దర్శకుడు కాదు. ఆయన కొడుకు హీరో కాదు. ఈ మధ్య కాలంలో `ఈ నగరానికి ఏమైంది?` అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ హీరో. ఈ హీరో ప్రస్తుతం ఫలక్నుమా దాస్ అనే సినిమా చేశారు. ఈ చిత్రం పబ్లిసిటీ ఎం.ఎస్.రాజుకు నచ్చిందట. అందులో కుర్రాడు బావున్నాడని పిలిచి అడ్వాన్స్ ఇచ్చేశారట. కొత్త దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తారని వినికిడి. సో నిర్మాతగా ఎం.ఎస్.రాజు పూర్వ వైభవం ఈ సినిమాతో వస్తే అంతకన్నా కావాల్సింది మరేముంటుంది? సినిమా పరిశ్రమ కోరుకునేది నిర్మాతలు పచ్చగా ఉండాలనే కదా.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!