Sensation: టాలీవుడ్ లో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటే మరికొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.. ఈ సంవత్సరం టాలీవుడ్ లో కొంతమంది నటినటులు ఎన్నడూలేని విధంగా కాంట్రవర్సీ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇక ఆ లిస్ట్ లో మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, సాయి పల్లవి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకు వాళ్ళు చేసిన కామెంట్స్ ఏంటంటే.!?
సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత గా హిట్ కామెంట్ మేజర్ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేష్ బాబు బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన ఒక కామెంట్ అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తనను భరించలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్ గా మారింది. టాలీవుడ్ లోనే తనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని అందుకే ఇతర ఇండస్ట్రీలో కూడా వెళ్లాలని అనుకోవడం లేదని కూడా అన్నాడు. ఇక మహేష్ అలా కామెంట్ చేయడంతో కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా మహేష్ కామెంట్స్ పై కౌంటర్ వేశారు.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడమే కాకుండా.. ఆ సినిమా పెట్టుబడి విషయంలో అవకతవకలు జరిగాయని ఈడీ చిత్ర యూనిట్ సభ్యులను అలాగే హీరో విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంబంధించిన పెట్టుబడి విషయంలో ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ ను కూడా విచారించారు.
సాయి పల్లవి కూడా ఈ ఏడాది కాంట్రవర్సీ లలో నిలిచింది.. కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడిన ఆమె 90లో కాలంలో పండితులను ఏ విధంగా చంపారో ఆ సినిమాలో చూపించారు. కానీ ముస్లిం కు చెందిన ఒక డ్రైవర్ను కొట్టి జైశ్రీరామ్ అరవడం జరిగింది. కానీ రెండు ఘటనలతో తేడా ఏముందని సాయి పల్లవి స్పందించిన విధానం ఒక్కసారిగా వివాదాలకు తెర లేపింది. ఆ తరువాత అందరికి నచ్చచెప్పే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
దిల్ రాజు వారిసు సినిమా కోసం మిగతా సినిమాలకు థియేటర్లకు దక్కకుండా చేస్తున్నారని .. విజయ్ అజిత్ లను పోలుస్తూ విజయ్ కొంత పెద్ద స్టార్ హీరో అని అందుకే ఆయన కోసం ఎక్కువ థియేటర్స్ తమిళనాడులో అడుగుతున్నట్లు చేసిన కామెంట్ కూడా వైరల్ అయింది.