Veera Simha Reddy: నందమూరి బాలయ్య బాబు.. కొత్త సినిమా “వీరసింహారెడ్డి” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీ సృష్టిస్తుంది. బాలయ్యకు కలిసొచ్చే ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే. ఫస్టాఫ్ లో “వీరసింహారెడ్డి” పాత్రలో సీనియర్ బాలకృష్ణగా అద్భుతమైన నటనతో… సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తరహా హై వోల్టేజ్ లో సన్నివేశాలలో బాలయ్య కనిపించడం ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబోడుచుకున్నేలా చేశాయి.
“వీరసింహారెడ్డి” పాత్ర సినిమా మొత్తానికీ హైలైట్ గా నిలిచింది. సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో… సంక్రాంతి పండుగ కలెక్షన్స్ భారీ ఎత్తున రాబడుతూ ఉంది. అయితే ఈ సినిమాని బాలకృష్ణ పెద్ద కూతురు ప్రేమని హైదరాబాద్ కుకట్ పల్లిలో అభిమానులతో కలిసి చూడటం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా అద్భుతంగా ఉందని ఖచ్చితంగా ఫ్యాన్స్ కి నచ్చుతుందని చెప్పుకొచ్చింది. తన తండ్రి సినిమాను అభిమానులతో కలిసి చూడటమే ఎంతో ఇష్టమని తెలిపింది. ఇదే సమయంలో తన తండ్రి బాలకృష్ణ నటనను పొగుడుతూ ప్రశంసల వర్షం కురిపించింది.
దేశంలో తన తండ్రి మాదిరిగా డైలాగ్స్ చెప్పే హీరో మరొకరు లేరని ఎవరి వల్ల కాదని… అలాంటి నటుడు దేశంలో ఒకే ఒక్కడు తన తండ్రి అంటూ ఆకాశానికి ఎత్తేసింది. వ్యక్తిగతంగా వీరసింహారెడ్డి తనకు ఎంతగానో నచ్చిందని… నాన్నలు అదిరిపోయిందని తెలిపింది. రాయలసీమ ప్రాంతాన్ని చాలా గొప్పగా చూపించారు. ప్రతి సంక్రాంతికి నాన్న ఎలాంటి కానుక ఇస్తారో ఈసారి కూడా… వీరసింహారెడ్డి తో అదే తరహా కానుక ఇచ్చారని సినిమా అద్భుతంగా ఉందని బ్రాహ్మిని కీలక వ్యాఖ్యలు చేసింది.