ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు వస్తూ ఉన్నాయి. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలే చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ తరహాలో RRR, బాహుబలి 2, కేజిఎఫ్ సినిమాలు అనేక రికార్డులు సృష్టించటం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ₹1000 కోట్ల భారీ బడ్జెట్ తో హీరో సూర్యతో డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
పూర్తి విషయంలోకి వెళ్తే తమిళనాడు ఎంపీ వెంకటేశన్ చారిత్రక నేపథ్యంలో రాసిన ప్రఖ్యాత “నేర్పాలి” నవల ఆధారంగా ఈ సినిమా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ శంకర్ స్టార్ట్ చేసినట్లు టాక్. ప్రస్తుతం హీరో సూర్య ఇంకా డైరెక్టర్ శంకర్ ఎవరికి వారు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవన్నీ పూర్తికాగానే కొత్త మూవీ పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. హీరో సూర్య యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ సినిమా చేస్తూ ఉన్నారు.
ఈ సినిమాని అగ్ర దర్శకుడు శివ చిత్రీకరిస్తున్నారు. యు వి క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పది భాషల్లో విడుదల కానుంది. త్రీడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంకా శంకర్ విషయానికొస్తే దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రామ్ చరణ్ హీరోగా “RC 15”, కమలహాసన్ “ఇండియన్ 2” సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ రెండు కంప్లీట్ అయిన వెంటనే సూర్య సినిమాపై శంకర్ వర్క్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.