Ponniyin Selvan: ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో పాన్ ఇండియా హవా నడుస్తోంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు దర్శకులు ఇంకా నిర్మాతలు హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా బాలీవుడ్ హీరోలు సినిమాలను సౌత్ లో విడుదల చేసే క్రమంలో ఎక్కడ ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా బాలీవుడ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు.
ఇదిలా ఉంటే అసలు దక్షిణాది సినిమా రంగంలో పాన్ ఇండియా సినిమా మొట్టమొదట చేసింది ఎవరు అన్నదానిపై డైరెక్టర్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “పోనియన్ సెల్వన్ -1” సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన శంకర్ మాట్లాడుతూ డైరెక్టర్ మణిరత్నంపై ప్రశంసలు వర్షం కురిపించారు. పాన్ ఇండియా పదం మనం ఈ రోజుల్లో వింటున్నాం. కానీ మణిరత్నం సార్ ఇండియాలో మొదట పాన్ ఇండియా డైరెక్టర్. అప్పట్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన రోజా, బొంబాయి.. దేశవ్యాప్తంగా అలరించాయి. ఆయన శైలి పనితీరుకు అప్పట్లోనే చాలామంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాకా ఇప్పుడు మణిరత్నం సార్.. మార్గంలోనే ఇప్పుడు అందరూ దర్శకులు వెళ్తున్నారు. ఏది ఏమైనా ఇండియాలో పాన్ ఇండియా ప్రాజెక్టులకు అధ్యుడు మణిరత్నమని శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు.
Maniratnam: డైరెక్టర్ మణిరత్నం కోసమే ఇండస్ట్రీకి వచ్చాను.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్..!!
“పోనియన్ సెల్వన్ -1” తమిళంలో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. విక్రమ్, కార్తీ, జయరాం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, శోభిత దూళిపాళ్ల ఇంకా చాలామంది నటీనటులు ఈ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ మణిరత్నం ప్రారంభంలో సినిమా చేస్తున్న సమయంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసినట్లు తెలపడంతో ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 30 వ తారీఖున “పోనియన్ సెల్వన్ -1” తెలుగు, తమిళం ఇంకా పలు భాషల్లో రిలీజ్ కానుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!