Shankar-Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ మెగా హీరోతో తమిళ దర్శకుడు శంకర్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా చేయడం కోసం కొన్ని వివాదాలు ఏర్పడినప్పటికీ శంకర్ ఏ మాత్రం తగ్గకుండా సినిమా పనులను మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే కమల్ హాసన్ ప్రధాన పాత్రలో “ఇండియన్ 2” చిత్రాన్ని ప్రారంభించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర నిర్మాణం వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే “ఇండియన్ 2” చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సమస్థ వారు తమ సినిమా పూర్తి కానిదే ఇతర సినిమాలు చేయడానికి అవకాశం లేదంటూ శంకర్ ki నోటీసులు పంపారు. ఈ విధంగా నోటీసులు పంపినప్పటికీ శంకర్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా రామ్ చరణ్ సినిమా పనులను మొదలు పెట్టాడు.
రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడం కోసం నటీనటుల వేటలో దర్శకులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో 30 నిమిషాల పాటు సాగే ఓ ప్రధాన పాత్రలో నటించడం కోసం స్టార్ హీరోలను వెతుకుతున్నారు. శంకర్ దర్శకత్వం వహించే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం వల్ల పలు భాషలలో స్టార్ సెలబ్రిటీలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
శంకర్, రామ్ చరణ్ ద్విపాత్రాభినయం:
దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో హిందీ, తమిళం, కన్నడ భాషలలో తెరకెక్కనుంది.హిందీలో ఈ ప్రధాన పాత్రలో నటించడం కోసం సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందని దర్శకుడు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే అతనితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అదేవిధంగా తమిళంలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ సేతుపతి అయితే ఈ పాత్రలో బాగుంటుందని దర్శకుడు అభిప్రాయపడుతున్నారు. ఇక కన్నడలో సుదీప్ లేదా ఉపేంద్రను తీసుకునే ఆలోచన చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ ప్రధాన పాత్రలో నటించడానికి ముందుగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు వినిపించినప్పటికీ శంకర్ మాత్రం ఈ కీలకమైన పాత్రలో రామ్ చరణ్ తేజ్ ను ద్విపాత్రాభినయంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో ఉండే ప్రధాన పాత్రలో దర్శకుడు ఎవరినైనా తీసుకుంటారా లేక చరణ్ పై తన ప్రయోగం చేస్తారా అనే విషయం గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!