భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఖచ్చితంగా అందరికంటే ముందుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అర్జున్ హీరోగా వచ్చిన జెంటిల్ మాన్ సినిమాతో దర్శకుడిగా మారిన శంకర్ మొదటి సినిమాతోనే సంచలనం సృష్ఠించాడు. సౌత్ అండ్ సినిమా ఇండస్ట్రీలలో ప్రతీ ఒక్కరు శంకర్ గురించి మాట్లాడుకునేలా తన మొదటి సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, శివాజీ, రోబో..ఇలా ప్రతీ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందినవే. ఎంత భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించినప్పటికి ప్రతీ సినిమాకి సామాజిక అంశాన్నే కథ వస్తువుగా తీసుకున్నాడు.
భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో హై టెక్నికల్ వ్యాల్యూస్ తో శంకర్ తీసిన సినిమాలకి ప్రపంచ వ్యాప్త్రంగా క్రేజ్ ఉంది. భారతీయుడు సినిమాతోనే మన భారతీయ సినిమా రేంజ్ ని ప్రపంచం అంతటా చాటాడు. అయితే శంకర్ మీద ఉన్న పెద్ద నెగిటివ్ టాక్ …ఆయన సినిమాలకి భారీగా ఖర్చు పెట్టిస్తాడు…చాలా నెలలు సినిమాని చుడతానే ఉంటాడు అని.
ఇక శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో 1996 లో వచ్చి సెన్షేనల్ హిట్ సాధించి టాప్ టెన్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన భారతీయుడు కి సీక్వెల్ ని రూపొందిస్తున్నారు. భారతీయుడు 2 గా వస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
అయితే రీసెంట్ గా చాలా సినిమాలు నేరుగా ఓటీటీ లో రిలీజవుతున్నాయి. బాలీవుడ్ కోలీవుడ్ సహా ఇప్పటికే దాదాపు 10 సినిమాలు రెడీ అయ్యాయి. వీటిలో బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళ సినిమాలున్నాయి. అయితే ఇలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడం తనకి ఇష్టం లేదన్నట్టుగా శంకర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకి ఓటీటీ కరెక్ట్ కాని భారీ బడ్జెట్ సినిమాలని, పాన్ ఇండియా సినిమాలకి కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా అయితే తన నుండి సినిమాలు ఇక రావడం కష్టమని హింట్ ఇచ్చాడు. మరి దీన్ని బట్టి ఇప్పుడు సెట్స్ మీదున్న భారతీయుడు 2 ఉంటుందా లేదా అన్న డైలమా నెలకొంది.