సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ లలో శంకర్ ఒకరు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు వినిపిస్తున్న గాని.. అంతకుముందే శంకర్ తన చిత్రాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని దడదడ లాడించాడు. విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా సరికొత్త రీతిలో తన టేకింగ్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులు మరియు కలెక్షన్స్ సాధించడం జరిగింది. చాలామంది హీరోలకు శంకర్ దర్శకత్వంలో నటించాలని డ్రీమ్. ఇదిలా ఉంటే శంకర్ కూతురు అదితి శంకర్.. హీరోయిన్ గా ప్రస్తుతం రాణిస్తున్న సంగతి తెలిసిందే. హీరో కార్తీ నటించిన వీరుమన్ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతోనే బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఇక్కడ దాకా బాగానే ఉన్నా గాని అసలు ఫస్ట్ అదితి శంకర్ హీరోయిన్ గా సినిమాలోకి వస్తానంటే శంకర్ వద్దన్నారట.
అయితే ఫస్ట్ సినిమాలో ఏమైనా తేడా కొడితే ఇంకా సినిమాలు ఆపేస్తానని.. తెలపటంతో కూతురు చెప్పిన దానికి శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇలా ఉంటే ఫస్ట్ శంకర్ కూతురికి కార్తీక్ సినిమా ఛాన్స్ కాకుండా అంతకుముందు వేరే హీరో సినిమా అవకాశం వచ్చిందట. ఆ హీరో మరెవరో కాదు లిటిల్ సూపర్ స్టార్ శింబు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హీరోతో చేయొద్దని కూతురికి వార్నింగ్ ఇచ్చారట. శింబు సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ విని అప్పటికే.. అదితి శంకర్ రెడీ అయినట్లు ఈ విషయం శంకర్ దాదాపు వెళ్ళటంతో ఎట్టి పరిస్థితుల్లో అతని సినిమాలలో నటించవద్దని.. కూతురికి గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందట.
దీంతో అప్పుడు హీరో కార్తీ వీరుమన్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగిందంట. అయితే శింబు సినిమాకి వద్దని చెప్పడం వెనకాల అతడు చాలా మంది హీరోయిన్ లతో ప్రేమాయణం సాగించడంతోనే శంకర్ తన కూతురు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారంట. శంభో తనతో నటించిన నయనతార, హన్సిక, త్రిష… లతో ప్రేమ యవ్వారం నడిపారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా కూతురు విషయంలో సినిమా ఫీల్ లో శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.