హీరో శర్వానంద్ తన సినిమాల మార్కెట్ పరిధిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఓ ద్విభాషా చిత్రంలో నటించనున్నాడు. తెలుగులో పాటు తమిళంలో ఈ సినిమా రూపొందనుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొత్త దర్శకుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వా ద్విభాషా చిత్రంపై ఫోకస్ పెట్టనున్నాడు. శర్వానంద్ ఇంతకు ముందు `ఎంగేయుమ్ ఎప్పొదుం` అనే తమిళ చిత్రంలో నటించాడు. తెలుగులో ఈ చిత్రమే `జర్నీ` పేరుతో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. తర్వాత ఎందుకనో శర్వానంద్ తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు.
previous post
next post