టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా ప్రాజెక్టులతో మంచి జోరుమీద ఉన్నాడు శర్వానంద్. జాను సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన తర్వాత ఎక్కడా నిరాశ చెందకుండా అనేక సినిమాలను ఒప్పుకొని వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టాడు. ఇదిలా ఉండగా శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకారం” అనే సినిమా చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. ఇదే తరుణంలో సౌత్ ఇండియా ఫేమస్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం డైరెక్షన్ లో తమిళ్, తెలుగు భాషల సినిమా ఒకటి చేయబోతున్నారు.
అంతే కాకుండా మరో తమిళ్ డైరెక్టర్ తో పాటుగా “ఆర్ఎక్స్ 100” సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో కూడా శర్వానంద్ సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకి మహాసముద్రం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా శర్వానంద్ ప్రకాష్ అనే ఒక కొత్త డైరెక్టర్ తో వైవిధ్యమైన స్టోరీ తో సినిమా చేయనున్నట్లు, ఆ సినిమాలో ఇండస్ట్రీలో ఏ హీరో చేయని విధంగా వికలాంగుడి పాత్ర శర్వానంద్ చేయనున్నట్లు సమాచారం.
స్టోరీ చాలా అద్భుతంగా ఉండటంతో పాటు వికలాంగుడి క్యారెక్టర్ చాలా వరకు ప్రభావితం చేసే విధంగా కొత్త డైరెక్టర్ డిజైన్ చేయటంతో వెంటనే ఈ సినిమాకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన, పెద్ద సినిమాల షూటింగులు ఇంకా ఏమి స్టార్ట్ కాలేదు.