యువ కథానాయకుడు శర్వానంద్ `రణరంగం` చిత్రంతో ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తారని తెలిపారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడిందట. సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్స్ చేస్తున్నారట. రీసెంట్గా విడుదలైన టీజర్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి తరుణంలో సినిమాను వాయిదా వేయడమంటే.. సాంకేతిక సమస్యలే ఉండొచ్చునని అంటున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా నటించారు. సుధీర్ వర్మ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్..దేవా అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్లో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తే.. డాక్టర్ పాత్రలో కాజల్ నటించింది.
previous post
next post