Sharwanand: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్కు తాజాగా బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగిందంటే.. శర్వా చివరిసారిగా `మహాసముద్రం` సినిమాతో పలకరించాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో హీరోగా నటించగా.. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించారు.
భారీ అంచనాల నడుమ 2021 అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్గా నిలిచింది. రూ. 14 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన మహాసముద్రం.. లాంగ్ రన్లో కేవలం రూ.6.44 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమా కారణంగా నిర్మాతలకు ఏకంగా రూ. 7.56 కోట్ల నష్టం వాటిల్లింది. ఇకపోతే కొన్ని చిత్రాలు వెండితెరపై బోల్తా పడినా.. బుల్లితెరపై భారీ రేటింగ్తో సూపర్ డూపర్ హిట్ అవుతుంటారు.
కానీ, మహాసముద్రం విషయంలో అలా జరగలేదు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీ ఫ్యాన్సీ రేటు చెల్లించి మరీ సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్యనే టెలివిజన్ లో ఈ చిత్రాన్ని తొలిసారి టెలికాస్ట్ చేయగా.. కేవలం 4.46 రేటింగ్ను మాత్రమే రాబట్టగలిగింది. దీంతో మహాసముద్రం వెండితెరపైనే కాదు బుల్లితెరపై సైతం ఫ్లాప్గా నిలిచింది. ఏదేమైనా మరీ ఇంత తక్కువ రేటింగ్ వస్తుందని చిత్ర టీమ్ అస్సలు ఊహించి ఉండరనే చెప్పాలి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!