సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 27 వ చిత్రం సర్కారు వారి పాట. పరశురాం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆర్ధిక నేరస్థుడుగా మహేష్ బాబు ఈ సినిమాలో కనిపిస్తుండగా బ్యాంక్ వ్యవస్థలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా నుండి ఫ్యాన్స్ కి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఏ అడ్డంకులు లేకపోతే సర్కారు వారి పాట ను చిత్ర యూనిట్ ఆగస్టు నుంచి సెట్స్ మీదకి తీసుకు వెళేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో పెద్ద బ్యాంక్ సెట్ ని నిర్మిస్తున్నారట చిత్ర బృందం. ఈ సెట్ లోనే కొన్ని కీలక సన్ని వేశాలను యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తారని సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఔట్ డోర్ షూటింగ్ కంటే ఇన్ హౌజ్ లో అయితేనే అన్ని విధాలా మంచిదని ఇలా షెడ్యూల్ ప్లాన్ చేశాడట దర్శకుడు పరశురాం.
ఇక ఈ సినిమాలో విలన్ గా అరవింద స్వామి నటించబోతున్నాడని సమాచారం. వాస్తవంగా సోనూ సూద్..కిచ్చా సుదీప్..లను అనుకున్న చిత్ర యూనిట్ చివరకి ధృవ లో అద్భుతమైన నటనతో రాం చరణ్ కి గట్టి పోటీ ఇచ్చిన అరవింద స్వామి అయితే మహేష్ రేంజ్ కి పర్ఫెక్ట్ అని విలన్ పాత్రకి ఆయనని సెలెక్ట్ చేసుకున్నారట. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ అని ప్రచారం జరుగుతున్నప్పటికి ఎక్కువ శాతం సాయి మంజ్రేకర్ కి మహేష్ పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యో అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో హీరోయిన్ ఎవరన్నది త్వరలో వెల్లడి కానుంది. మొత్తానికి సర్కారు వారి పాట టీం ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చింది.