తెలుగు సినీ ఇండస్ట్రీని తన స్టెప్పులతో ఒక ఊపు ఊపుతూ ఒక వెలుగు వెలుగుతున్నారు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. మెగాస్టార్ వేసిన అమ్మడు లెస్ట్ డూ కుమ్ముడూ అని, ఎన్టీఆర్ సింగ్ జరా, రామ్ చరణ్ కుంగ్ ఫూ కుమారి అన్నా ఆ స్టెప్పుల వెనకాలున్నది మాత్రం శేఖర్ మాస్టర్..టాప్ హీరోలందరి ఫేవరెట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు శేఖర్ మాస్టర్.
శేఖర్ మాస్టర్ అనేక పెద్ద హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే ఢీ జోడికి జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఢీ 2 లో డాన్స్ కొరియోగ్రాఫర్ గా తన సత్తాను చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా డ్యాన్స్ రియాల్టీ షో‘ఢీ ఛాంపియన్స్’ లో న్యాయ నిర్ణేతలుగా కొనసాగుతున్నారు. ఆయనతో పాటుగా ప్రియమని, పూర్ణ కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఇటీవలె క్వార్టర్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా కొంతమంది డ్యాన్సర్లు తమ పర్ఫామెన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు.
కాగా సుధీర్ రష్మీ టీమ్ నుంచి రాజు చేసిన ‘ఓ మై గాడ్ డాడీ’ అనే పాటకు పర్ఫామెన్స అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే పెర్ఫామెన్స్ మొదట్లో ఇంట్లో మనం తప్పుచేస్తే దానిని సరిచేడానికి డాడి ఉంటారు. అలాగే ఈ షో లో ఎవరైనా తప్పు చేస్తే తండ్రిలా ఆ తప్పును సరిచేయడానిక శేఖర్ మాస్టర్ ఉంటాడంటూ రాజు చెప్పాడు. దాంతో శేఖర్ మాస్టర్ రాజు పెర్ఫామెన్స్ తర్వాత భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఢీ స్టేజ్ పై మొదట్లో ఒంటరిగా పోరాటం ప్రారంభించాను. కాని నాకు ఇప్పుడు ఇంతమంది తోడుగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మీతో ఉంటే. ఈ స్టేజ్ కి ఏదో అద్భుతం ఉంది. దీని ద్వారా చాలా మంది కొరియోగ్రాఫర్లుగా ఆపర్చునుటీని అందుకున్నారు. న్యాయనిర్ణేతలుగా మేము ఏం చెప్పినా అది మీ మంచి కోసమే చెప్తాము.. మీరు వాటిని వేరేలా తీసుకోకండి.. నా వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ అని శేఖర్ మాస్టర్ తెలిపారు.