సినీ ఇండస్ట్రీలో రావాలని, సక్సెస్ సాధించాలని ఎంతో మందికి కల.. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వచ్చినా మంచి గుర్తింపు తెచ్చకోవాలి. లేకపోతే జనాలు వాళ్లను అస్సలు గుర్తించరు.. అయితే అదృష్టం కొందరికే వరిస్తుంది. మరికొందరికి ఏళ్లే గడిచినా ఎదురుచూపులు తప్పవు.. అయితే చిన్నప్పటి నుంచి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి జయవాణి.. చదువుకునే రోజుల్లోనే పెళ్లి చేసుకుంది.. జయవాణి సినిమాల్లో రావడానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.. పెళ్లయిన తర్వాత భర్త సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది..
మొదట సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది. తర్వాత మెల్లగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదట్లో వ్యాంప్ పాత్రల్లో నటించి పాపులర్ అయిన జయవాణికి.. విక్రమార్కుడు, యమదొంగ, మహాత్మా, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లోఛాన్స్ వచ్చింది. తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయవాణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది..
ఓ సినిమాలో వేణుమాధవ్ తో జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు జయవాణి. ‘‘అదిరిందయ్య చంద్రం’ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. అందులో వేణుమాధవ్ తాగి రోడ్డుపై పడిపోతాడు. అతన్ని లేపి ఇంటికి తీసుకెళ్లాలి.. ఇక డైరెక్టర్ వచ్చి సీన్ వివరించి రిహార్సల్స్ చేయించారు. అయితే రిహార్సల్స్ చేసేప్పుడు కేవలం డైలాగులు మాత్రమే ఉన్నాయి. తీరా యాక్షన్ అనగానే నేను క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను. అప్పుడు వేణుమాధవ్ ని కాలితో తన్నుకుంటూ ఈడ్చుకెళ్లాను’.
‘ఆ సీన్ టేక్ ఓకే అయిన తర్వాత డైరెక్టర్ వచ్చి అలా తన్నేశావేంటీ? సీన్ లో అలా లేదు కదా.. వేణు మాధవ్ మధ్యలోనే వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటని కంగారు పడ్డార. అదే సమయంలో వేణుమాధవ్ వచ్చి సీన్ బాగా చేశావ్ అని చెప్పారు. అప్పుడు పరిస్థితి కూల్ అయిపోయింది’.. అని జయవాణి ఈ సినిమాలో జరిగిన సీన్ గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జయవాణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..