Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాలుగు సినిమాలతో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధేశ్యామ్” చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను జూలైలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టీ – సిరీస్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్పై భూషణ్ కుమార్, కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్, ప్రశీద 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే చిత్రం విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటన చేశారు.అయితే అనుకున్న విధంగానే ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
రాధేశ్యామ్ చిత్రం పై కరోనా ప్రభావం:
రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తయిన ప్రీ ప్రొడక్షన్ పనులకు మాత్రం బ్రేక్ పడుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్ డౌన్ కూడా విధించారు. ఈ కారణంగానే ప్రస్తుతం ముంబైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా మహమ్మారి వల్ల బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ముంబైలో కరోనా ఉధృతి అధికమవడంతో వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేయడం కోసం ముంబై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేయాలని చిత్ర బృందం ఆలోచన చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం జులై 30 వ తేదీన విడుదల కావడం కష్టమని తెలుస్తోంది. ఈ విధంగా తమ అభిమాన నటుడి సినిమా విడుదల వాయిదా పడుతుందేమోనని తెలియడంతో మరోసారి ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!