హీరోయిన్ శృతిహాసన్ అందరికీ సుపరిచితురాలే. కమల్ హాసన్ కూతురుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ దక్షిణాదిలో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడం జరిగింది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అనేకమంది టాప్ స్టార్ హీరోల సరసన నటించడం జరిగింది. తెలుగులోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇంకా చాలామంది హీరోలతో చేయగా.. ప్రస్తుతం ప్రభాస్ ఇంకా బాలకృష్ణతో సినిమాలు చేస్తూ ఉంది. నటనపరంగా ఇంకా డాన్స్ పరంగా శృతిహాసన్ స్క్రీన్ మీద చాలా కష్టపడుతూ ఉంటది. తండ్రి కమలహాసన్ కి తగ్గట్టు రాణిస్తూ ఉంది.
కెరియర్ లో అనేక ఎత్తు ఫలాలు చూసిన శృతిహాసన్ పర్సనల్ లైఫ్ లో ప్రేమ విఫలం కావడంతో చాలాకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. కానీ ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా గడుపుతూ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ తన తల్లిదండ్రుల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అమ్మానాన్నలు ఎవరికి ఫోన్ చేసి రికమెండ్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తెలుగులో ప్రారంభంలో అనేక సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్ అయ్యాయి.
ఆ టైంలో నాకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అటువంటి సమయంలో గబ్బర్ సింగ్ లో నాకు పవన్ కళ్యాణ్ అవకాశమిచ్చారు. ఆ టైంలో వేరే హీరోయిన్ పెట్టే అవకాశం ఉన్నాగాని పవన్.. నాతో సినిమా చేశారు. నిజంగా ఆయన నాకు చాలా లక్కీ పర్సన్. గబ్బర్ సింగ్ తర్వాత నా కెరియర్ యూటర్న్ తీసుకుంది. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ నిజంగా ఆయన డార్లింగ్. బన్నీ మంచి డెడికేషన్ ఉన్న వ్యక్తి.. చాలా కష్టపడతాడు. రామ్ చరణ్ మంచి వ్యక్తిత్వం కలిగిన హీరో. . అంటూ శృతిహాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి కొంతమంది హీరోల గురించి చెప్పుకొచ్చింది.