Shruti Haasan: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `మెగా 154` వర్కింగ్ టైటిల్తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నారు. కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చిరు మత్యకారుడిగా కనిపించబోతున్నాడు.
ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా శ్రుతి హాసన్ను ఎంపిక చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రుతిని హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. అయితే ఈ సినిమాకు ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం.. `మెగా 154`కు శ్రుతి హాసన్ ఏకంగా రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఆమెకు ఉన్న క్రేజ్, సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఏర్పడటం వంటి కారణాల వల్ల నిర్మాతలు సైతం అంత మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి వెనకడుగు వేయలేదని టాక్ వినిపిస్తోంది. అయితే శ్రుతి హాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సరసన `ఎన్బీకే 107`లో చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.
ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి శ్రుతి హాసన్ కేవరం రూ. 1.5 కోట్లు మాత్రమే తీసుకుంటుందట. అయితే బాలయ్య సినిమాకు తక్కువ, చిరు మూవీకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడానికి గోపీచంద్ మలినేని కారణమని అంటున్నారు. ఎందుకంటే, ఈయన దర్శకత్వంలో వచ్చిన `క్రాక్` మూవీతోనే శ్రుతి గ్రాండ్గా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాతే ఆమె వకీల్ సాబ్, సలార్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. అందుకారణంగా బాలయ్య మూవీకి శ్రుతి హాసన్ తక్కువ పారితోషికం తీసుకుంటుందని టాక్.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!