Shruti Haasan: కమల్ కూతురుగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించింది. ఇక తెలుగులో శృతిహాసన్ కి మంచి మార్కెట్ ఉంది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, మహేష్ బాబుతో శ్రీమంతుడు, రామ్ చరణ్ తో ఎవడు, అల్లు అర్జున్ తో రేసుగుర్రం వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని.. తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. అయితే కొన్నాళ్ళకు వరుస పెట్టి పరాజయాలు పలకరించడంతో అవకాశాలు తగ్గాయి.
ఇలా ఉంటే ఇప్పుడు పాండమిక్ తర్వాత చాలావరకు.. సీనియర్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ ఉంది. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న “వీరసింహారెడ్డి” , డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న “వాల్తేరు వీరయ్య” లో హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఫినిషింగ్ వర్క్ లు చివరికి చేరుకున్నాయి. “వీరసింహారెడ్డి” ఒక సాంగ్ మినహా.. మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. “వాల్తేరు వీరయ్య” కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ వ్యవధిలో సంక్రాంతి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్నాయి.
దీంతో చిరంజీవి.. బాలకృష్ణ తమ సినిమాలకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలకు రెడీ అవుతున్న క్రమంలో… శృతిహాసన్ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలలో హీరోయిన్ శృతిహాసన్ కావడంతో ఈ ఇద్దరు టాప్ హీరోల ప్రమోషన్ కార్యక్రమాలలో డేట్ లు సర్ద లేక… అనేక అవస్థలు పడుతుందట. జనవరి 12వ తారీకు బాలకృష్ణ “వీరసింహారెడ్డి” రిలీజ్ అవుతుంది. జనవరి 13వ తారీకు చిరంజీవి “వాల్తేరు వీరయ్య” విడుదల కానుంది. దీంతో ఈ రెండు సినిమాలు ప్రమోషన్ కార్యక్రమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తూ ఉండటంతో హీరోయిన్ గా శృతిహాసన్… అనేక తిప్పలు ఎదుర్కొంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.