టాలీవుడ్ ఇండస్ట్రీలో సెట్స్ పై ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న “వాల్తేరు వీరయ్య”, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న “NBK107” లలో హీరోయిన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కర్నూలులో జరిగిన ఓ షెడ్యూల్ లో కూడా శృతిహాసన్ పాల్గొనడం జరిగింది. ఈ సీనియర్ హీరోలకు సంబంధించి రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శృతిహాసన్ “సలార్” విషయంలో ఒక్కసారిగా రేటు పెంచేసినట్లు.. భారీ ఎత్తున రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. దేశవ్యాప్తంగా “సలార్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో శృతిహాసన్ కూడా యాక్షన్ సీక్వెన్స్ లో… విలన్లతో తలపడనున్నట్లు అందువల్ల భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. “సలార్” వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. దాదాపు ఏడాదికి పైగానే సమయం ఉంది.
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే “సలార్” లో శృతి హాసన్ చేయబోయే పాత్ర మరొక ఎత్తు అని.. అందువల్లే దాదాపు మూడు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోం బెల్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాండమిక్ తర్వాత రవితేజ తో క్రాక్, పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ లతో రెండు వరుస విజయాలు అందుకోవటం జరిగింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ కి మంచి డిమాండ్ ఏర్పడింది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!