Shruti Hassan : మంచి సక్సెస్ లో ఉన్న సమయంలోనే ప్రేమలో పడి సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్.. బ్రేకప్ అయ్యి ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సంచలన విజయం సాధించడంతో తిరిగి శృతిహాసన్ ట్రాక్ లో పడినట్టు తెలుస్తుంది. క్రాక్ సినిమా ద్వారా విజయం సంపాదించుకున్న శృతిహాసన్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సాధించుకున్న ప్రభాస్ తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.అయితే పాన్ ఇండియా చిత్రంగా సలార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించడానికి శృతి హసన్ కూడా రెమ్యునరేషన్ పరంగా భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో హీరోయిన్ గా నటించడం కోసం శృతిహాసన్ ఇదివరకెప్పుడూ తీసుకొని భారీ రెమ్యునరేషన్ ఈ చిత్రం ద్వారా తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుడడంతో ఎక్కువ రోజులు కేటాయించాల్సి వస్తుందని నేపథ్యంలో శృతిహాసన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోనున్నట్లు చిత్రబృందం తెలియజేశారు.
ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి పేరు వినిపిస్తోంది. ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” చిత్రంలో నటించనున్నారు. దీని తర్వాత ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారు.