Shruti hassan : సిద్ధార్థ తో జతకట్టి వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక ఐరన్ లెగ్ గా భావించారు. తరువాత సినిమా సిద్ధార్థ తో కలిసి” ఓ మై ఫ్రెండ్” లో నటించారు. ఈ సినిమా కూడా పర్వాలేదని అనిపించుకుంది. తరువాత పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్, మహేష్ బాబు తో జతకట్టి శ్రీమంతుడు, రవితేజ సరసన బలుపు వంటి సినిమాలలో నటించి వరుస విజయాలను అందుకుంది. మొదట ఐరన్ లెగ్ అని భావించిన ఇండస్ట్రీ మొత్తం తర్వాత శృతి హాసన్ లక్కీ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
ఈ విధంగా తెలుగు తమిళ సినిమాలలో బిజీగా గడుపుతున్న శృతిహాసన్ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు సినిమాలో నటించింది. ఇది తన జీవితంలో ఒక డిజాస్టర్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి హాసన్ తిరిగి రవితేజ “క్రాక్”సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా విజయవంతం కావడంతో శృతి హాసన్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న “సలార్” సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమాలకు విరామం చెప్పిన శృతిహాసన్ రీఎంట్రీ ద్వారా తన కెరీర్ విజయపథంలో దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈమెకు వరుస అవకాశాలు రావడంతో ఒకేసారి రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తోంది. ప్రభాస్ సరసన నటించే సలార్ సినిమా కోసం ఇప్పటివరకు తన కెరియర్లో తీసుకోనంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ తరహాలో తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు కూడా శృతి హాసన్ డిమాండ్ కి ఒప్పుకొని అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.