Siddharth: కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో సిద్ధార్థ.. తెలుగులో “బాయ్స్” సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమా అదిరిపోయే క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా విజయంతో తెలుగులో దాదాపు స్టార్ హీరోలకు మంచి పోటీ ఇచ్చారు. ఆ తర్వాత “బొమ్మరిల్లు” సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ దక్కించుకున్న సిద్ధార్థ .. తర్వాత వరుస పెట్టి పరాజయాలు అందుకోవడం జరిగింది. దీంతో అవకాశాలు తగ్గిపోవడంతో.. మళ్లీ లో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయిన సిద్ధార్థ.. గత కొన్ని సంవత్సరాల నుండి అక్కడే సినిమాలు చేస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మరోసారి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధార్థ రెడీ అయ్యారు. “ఆర్ఎక్స్ 100” సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో “మహాసముద్రం” అనే సినిమా ద్వారా సిద్ధార్థ తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అయ్యారు. శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ కి కీలక క్యారెక్టర్ అజయ్ భూపతి ఇచ్చినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినపడుతోంది.
Read More: Yash : కేజీఎఫ్ హీరో యశ్ వీరాభిమాని ఆత్మహత్య..! ఎందుకో తెలుసా..!?
అయితే ఈ పాత్ర కోసం ఏకంగా సిద్ధార్థ మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్. అసలు సినిమాలు చేసి చాలా కాలం అయినా గాని సిద్ధార్థ కి మూడు కోట్లు ఇవ్వడానికి సినిమా ప్రొడ్యూసర్లు కూడా రెడీ అయినట్లు .. వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో సినీ ప్రేమికులు… ఫామ్ లో లేకపోయినా గాని సిద్ధార్థ కి టాలీవుడ్ ఇండస్ట్రీ పై పట్టు పోలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.