Nijam With Smitha: మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ రంగానికి సంబంధించి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. సోనీ లైవ్ లో సింగర్ స్మిత హోస్ట్ చేస్తున్న “నిజం విత్ స్మిత” షోకీ చిరంజీవి రావడం జరిగింది. మొదటి ఎపిసోడ్ చిరంజీవిది కావటంతో.. స్మిత పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేయడం జరిగింది. వ్యక్తిగత, కుటుంబ, కెరియర్ మరియు పొలిటికల్ కీ సంబంధించి అనేక ప్రశ్నలు వేసింది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో మీరు చాలామంది హీరోయిన్లతో నటించారు. ఎక్కువగా విజయశాంతి, రాధిక, రాధ, శ్రీదేవిలో ఎవరు బెస్ట్ అని ప్రశ్నించడం జరిగింది. దీనికి చిరంజీవి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “నాకు అందరితో మంచి రిలేషన్ ఉంది. హీరోయిన్లలో ఎవరి స్పెషాలిటీ వాళ్లకు ఉంది.
అయితే శ్రీదేవితో ప్రొఫెషనల్ మరియు పర్సనల్ రిలేషన్స్ ఉన్నాయి. అందుకే ఆమె నా ఫేవరెట్. శ్రీదేవితో నటించిన ప్రతిక్షణం చాలా ఎంజాయ్ చేస్తాను.. అని అన్నారు. ఇంకా రాధిక, విజయశాంతి అయితే డాన్స్ పరంగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు. గతంలో ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ లో సౌందర్య అంటే తనకు చాలా ఇష్టమని చిరంజీవి చెప్పుకొచ్చారు. కాగా ఇప్పుడు శ్రీదేవి అని చెప్పటం విశేషం. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. కరోనా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ సినిమాలు చేసిన హీరోగా చిరంజీవి నిలిచారు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ రిలీజ్ చేయడం జరిగింది.
ఆచార్య అట్టర్ ఫ్లాప్ కాగా “గాడ్ ఫాదర్” తో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది స్టార్టింగ్ లో “వాల్తేరు వీరయ్య” సినిమాతో విజయం పొందారు. ఇప్పుడు వేసవికి “భోలా శంకర్” సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ … తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో స్మిత టాకీ షోలో చిరంజీవి పాల్గొనడం.. ఎపిసోడ్ తాజాగా ప్రచారం కావడంతో మెగా అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!