ప్రముఖ ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈరోజు నిశ్చితార్థ వేడుకను కూడా జరుపుకున్నారు. సునీత వివాహం చేసుకొబోతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చినప్పటికి.. ఆ వార్తలను ఆమె ఖడించారు. తాజాగా ఆ వార్తలు నిజం చేస్తూ బిజినెస్ మాన్తో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారు. అయితే సునీత వివాహం చేసుకొబోయే వ్యక్తి ఎవరా అని అభిమానులు అరా తీస్తున్నారు. అయితే సునీత వివాహం చేసుకోబోయే వ్యక్తి రామ్ వీరపనేని.. అతను డిజిటల్ సంస్థకు యజమానిగా ఉన్నారు. మ్యాంగో ఛానల్ వాక్కెడౌట్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ని వీరపనేని నిర్వహిస్తున్నారు. అతనిది కూడా రెండో వివాహం అని తెలుస్తోంది. ఇద్దరూ ఎక్కడ కలిశారు అనేది తెలియదు. సునీతకు టాలీవుడ్లో ఉన్న పరిచయాల ద్వారా రామ్ వీరపనేని పరిచయమైనట్లు తెలుస్తుంది వీరిద్దరూ ఒక్కే ఇండస్ట్రీ లో ఉండడంతో మనుసులు కలిసి వివాహం వరకు వెళ్ళింది.
ప్రస్తుతం సునీత టాలీవుడ్లో ప్రముఖ గాయనిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో పాటలను ఆలపించిన ఆమె ఇప్పటినుంచి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారు. కాబోయే భర్తకు సంబంధించిన మీడియా సంస్థ బాధ్యతను చూసుకుంటారని తెలుస్తోంది.సునీత రెండో పెళ్లి పై గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే ఈరోజు వార్తను నిజం చేస్తూ తన రెండో పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది ఈ సింగర్. సునీత మొదటి భర్త విషయానికొస్తే అతని పేరు కిరణ్. మొదటి భర్తతో కొద్ది రోజులు పాటు సఖ్యతగా ఉన్నా ఆమె అతని ప్రవర్తనలో తేడా రావడంతో విడాకులు తీసుకుంది. అప్పటికే ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. సునీత 19 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. గత కొన్ని ఏళ్లుగా ఒంటరిగా ఉన్న సునీత తాజాగా రెండో వివాహానికి సిద్ధమయ్యారు. బంధువులు ఒత్తిడి కారణంగానే ఆమె ఈ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది