SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సక్సెస్ జ్యోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మే 12న విడుదలైన ఈ మూవీ నెగటివ్ టాక్ ను అధిగమించి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో మాస్ జాతర సృష్టిస్తోంది. ఐదు రోజుల్లోనే రూ. 91.37 కోట్ల షేర్, రూ.143.30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోందీ చిత్రం. ఈ నేపథ్యంలోనే కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో సోమవారం రాత్రి `సర్కారు వారి పాట` విజయోత్సవ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్ మినహా.. మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర యూనిట్ మొత్తం హాజరై సందడి చేశారు. అయితే ఈ సందర్భంగా మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మహేష్ మాట్లాడుతూ.. `సర్కారు వారి పాట సినిమాను మొదట మా ఫ్యామిలీతో కలిసి చూశాను.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమా పూర్తైన వెంటనే సితార నా దగ్గరకు వచ్చి అన్ని సినిమాల్లో కన్నా సర్కారు వారి పాటలోనే చాలా బాగా నటించావు నాన్న, ఇందులో మరింత అందంగా, హ్యాండ్సమ్ గా కూడా కనిపించావు అని కితాబు ఇచ్చింది. ఆమె మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగింది ` అంటూ మహేష్ బాబు తెలిపారు. ఈ క్రమంలోనే యాంకర్ `సర్కారు వారి పాటను చూశాక సూపర్ స్టార్ కృష్ణ గారి రియాక్షన్ ఏంటీ..?` అంటూ ప్రశ్నించింది.
నాన్న సినిమా చూడగానే పోకిరి, దూకుడు కంటే సూపర్ హిట్ అవుతుందని చెప్పారు, అదే జరుగుతోందంటూ మహేష్ బాబు పేర్కొన్నారు. అంతేకాదు, ఈ కార్యక్రమంలో మహేష్ మొదటిసారి వేదికపై డ్యాన్స్ చేసి అభిమానుల చేత కేకలు పెట్టించారు. ఎవరూ పిలవకుండానే స్టేజ్ పైకి వెళ్లి మహేష్ స్టెప్పులేయడం ఈవెంట్ కే హైలెట్ గా నిలిచింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!