టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా రంగంలోనే కాక సౌతిండియాలోని హాలీవుడ్ రేంజ్ కలిగిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. మహేష్ బాబుసినిమా రిలీజవుతుందంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డిస్ట్రిబ్యూటర్లకు పండగ. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ట్విట్టర్ లో ఉన్న ఇటీవల అనేక సందర్భాలలో మహేష్ క్రేజ్ అంటే ఏంటో పళ్ళు రికార్డుల ద్వారా దేశం మొత్తం తెలుసుకుంది. అటువంటి మహేష్ బాబు క్రేజ్ ని మించి పోయేలా ఆయన ఇద్దరు పిల్లలు సితార, గౌతమ్ ఇద్దరి పేర్లు ఇటీవల సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్న ట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మహేష్ గౌతమ్ సీతారా లను లాంచ్ చేయనున్నట్టు టాక్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే గౌతమ్ వన్ సినిమా లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇద్దరిని “సర్కారు వారి పాట” లో చూపించాలని మహేష్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లో వినపడుతున్న టాక్.
సినిమాలో ఈ ఇద్దరికీ మహేష్ బాబు మామయ్య నటించనున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో మహేష్ బాబు కొత్త సినిమా లో క్రేజ్ కంటే గౌతమ్ చితారాలు సినిమాలో ఉంటున్నట్లు వచ్చిన ఈ సినిమా వార్తకి విపరీతమైన లైకులు షేర్లు వస్తున్నాయట. ముఖ్యంగా ఘట్టమనేని సితార సోషల్ మీడియాలో అనేక పాటలకు డాన్స్ వేస్తూ చాలా ఎనర్జిటిక్ గా వీడియో లను పోస్ట్ చేస్తూ మహేష్ ఫాన్స్ ని ఫిదా చేసింది. ఇటువంటి తరుణంలో సితార, మహేష్ “సర్కార్ వారి పాట” సినిమా చేయాలని అనుకుంటున్నట్లు వార్త రావడంతో మహేష్ ఫ్యాన్స్ లో ఈ న్యూస్ సంచలనంగా మారింది.