Sonali Bendre: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా వరకు గతంలో స్టార్ హీరోయిన్ లుగా చలామణి అయిన వాళ్లు రీ ఎంట్రీ ఇస్తున్నారు. రమ్యకృష్ణ, ఖుష్బూ, మీనా, నదియా, స్నేహ, టాబు, విజయశాంతి, అమల, ఆమని.. వీళ్లంతా 90’s లో ఫుల్ బిజీ హీరోయిన్ లు. అక్కడి స్టార్ హీరోలతో వీళ్లంతా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. అయితే కొంతకాలానికి పెళ్లి చేసుకుని.. ఇండస్ట్రీకి దూరమైపోయిన వీళ్లంతా ఇప్పుడు… చాలా తెలివిగా రీ ఎంట్రీ విషయంలో.. వెయిట్ ఉన్న పాత్రని ఒప్పుకుంటూ.. సినిమాలు చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పుడు ఇదే తరహాలో సోనాలి బింద్రే కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లూ సమాచారం. 1999లో ప్రేమికులరోజు డబ్బింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సోనాలి బింద్రే..2001వ సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన “మురారి” లో హీరోయిన్ గా చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత చిరంజీవితో ఇంద్ర, కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం, నాగార్జున తో మన్మధుడు, బాలకృష్ణ తో పల్నాటి బ్రహ్మ నాయుడు, మళ్లీ చిరంజీవితో శంకర్ దాదా ఎంబిబిఎస్.. సినిమాలు చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న సోనాలి బింద్రే సినిమాలకు దూరం అయింది. ఇదే క్రమంలో కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడటం తెలిసిందే.
అయితే క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకున్న సోనాలి బింద్రే ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. అయితే చాలా తెలివిగా ప్రముఖ ఓటిటిలో సెంటిమెంట్ కంటెంట్ కలిగిన వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు చాలావరకు Zee5 వోటిటిలో సోనాలి బింద్రే అడుగు పెట్టనున్నట్లు సమాచారం.