Adi Purush: బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ “ఆది పురుష్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో కృతి సానన్ హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ టైం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ తో పని చేస్తూ ఉండటంతో అటు నార్త్ ప్రేక్షకులలో ఇటు సౌత్ ప్రేక్షకులలో “ఆది పురుష్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తూ ఉండటంతో.. కచ్చితంగా అనేక రికార్డులు సృష్టించటం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో భక్తి తరహాలో.. వస్తున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల నిఖిల్ నటించిన “కార్తికేయ 2”.
ఊహించని రేంజ్ లో ఈ సినిమా భారీ ఎత్తున కలెక్షన్ లు సాధించింది. కనీసం సరైన ప్రమోషన్స్ ఉత్తరాదిలో చేయకపోయినా గానీ.. రికార్డు సాయి వసూలు రాబట్టాయి. ఈ క్రమంలో అదే ఫ్లేవర్ తో “ఆది పురుష్” కి కచ్చితంగా జనాలు బ్రహ్మరథం పడతారని అంటున్నారు. పైగా ప్రభాస్ హీరో కావడంతో సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వస్తే ఇంకా.. వెనక్కి తిరిగి చూసుకో అక్కరలేదని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా “ఆది పురుష్” పై హీరోయిన్ సోనాలి చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. “ఆది పురుష్” సినిమాలో అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది.
ఇలాంటి చిత్రం చేయడమంటే చరిత్రలో ఒక భాగమైనట్లేనని పేర్కొంది. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ రాగానే ఒక నిమిషం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. ఫిలిం మేకింగ్ ఇంకా టెక్నాలజీ పరంగా…”ఆది పురుష్” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ట్రెండ్ సృష్టించడం గ్యారెంటీ అని తెలిపింది. “ఆది పురుష్” రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సోనాలి చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.