కరోనా వైరస్ ప్రారంభంలో దేశంలో లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు కొన్ని కోట్ల మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోవటంతో పాటు ఇంటికి చేరడానికి అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి కోసం స్పెషల్ ట్రైన్లు స్పెషల్ బస్సులు అదేవిధంగా స్పెషల్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చాడు సోనుసూద్. దేశంలో చాలా మంది హీరోలు ఉన్నాగాని అసలైన సమయంలో సోనూసూద్ స్పందించడంతో పాటు కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు చేయాల్సిన పనులు అని తానై ముందుండి చేసి అనేకమందిని ఆదుకోవడంతో సోనుసూద్ దేశంలోనే రియల్ హీరో అనిపించుకున్నారు.
లాక్ డౌన్ తర్వాత కూడా ప్రస్తుతం అనేక మంది పేద వాళ్ళను ఆదుకుంటూ.. ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని వారికి స్కాలర్షిప్స్ ఇస్తూ తనకంటూ సెపరేట్ టీంతో అనేక మందికి సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా అనేక మందికి ఉపయోగపడుతున్న సోనుసూద్ ఇంటర్నేషనల్ అవార్డు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రకటించింది. పూర్తి విషయంలోకి వెళ్తే “స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్” అవార్డును ప్రకటించిన ఐక్యరాజ్యసమితి అనుబంద సంస్ద.. UNO అనుబంధ సంస్థ యూఎన్డీపీ (United Nations Development Programme) స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును (SDG Special Humanitarian Action Award ) ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో లక్షలాది వలసకూలీలు, విద్యార్థులకు ఊహించనిరీతిలో సేవలందించినందుకు ఆయనకు ఈ అవార్డ్తో సత్కరించింది. ఓ వర్చువల్ కార్యక్రమంలో ఇటీవల ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇప్పటివరకు సినీ నటుల్లో ఆంజెలినా జోలీ, డేవిడ్ బెక్హమ్, లియోనార్డో డి కాప్రియో, ప్రియాంకా చోప్రాతో పాటు అతికొద్ది మందికి మాత్రమే ఈ అవార్డును అందుకున్నారు. ఆ అతికొద్ది మంది సినీ ప్రముఖుల జాబితాలో సోనూసూద్ చేరారు. ఈ అవార్డును అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు సోనూసూద్ తెలిపారు.