Reshmi Gautam: తెలుగు టెలివిజన్ షోలలో టాప్ మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్. ఈషో టిఆర్పి రేటింగ్లలో దూసుకుపోతూ ఉంటది. విపరీతమైన ఆదరణ కలిగిన ఈషో ద్వారా చాలామంది తమకంటూ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ షో ద్వారా సినిమా ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్ లు ఎంట్రీ అవ్వడం జరిగింది. శీను, చమ్మక్ చంద్ర, అప్పారావు, సుడిగాలి సుదీర్, రాంప్రసాద్… ఇంక చాలామంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక ఇదే షో ద్వారా యాంకరింగ్ రంగంలో అనసూయ మరియు రష్మీ కూడా క్రేజ్ సంపాదించడం జరిగింది.
అయితే ఇప్పటికే చాలామంది ఈ షోలో ఇటీవల ప్రముఖులు వెళ్లిపోవడం జరిగింది. అనసూయ ఇంకా సుధీర్ పలువురు వెళ్లిపోయారు. తాజాగా యాంకర్ రష్మీ కూడా జబర్దస్త్ నుండి … వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే వచ్చే గురువారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించి రష్మీ స్థానంలో కొత్త యాంకర్ సీరియల్ నటి సౌమ్యారావు ప్రోమోలో కనిపించింది. దీంతో రష్మీ కూడా జబర్దస్త్ నుండి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతుంది.
మరోపక్క రష్మీ కొత్త సినిమా…’బొమ్మ బ్లాక్ బస్టర్’ ఇటీవల విడుదలయ్యింది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటంతో.. రష్మీ రాలేకపోయినట్లు టాక్ నడుస్తుంది. మరో పక్క బుల్లితెరకు గుడ్ బై చెప్పి పూర్తిగా సినిమాల పైన దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికే జబర్దస్త్ షోలో చాలామంది ప్రముఖులు వెళ్లిపోయారు. ఇటువంటి సమయంలో రష్మీ కూడా వెళ్లిపోతే మాత్రం అది షోకి పెద్ద మైనస్ అని తాజా వార్త పై జబర్దస్త్ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.