బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ మరోసారి సౌత్ సినిమాల గురించి ప్రస్థావించారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు వరుస విజయాలతో దుసుకెళ్తున్నాయి. దానితో బాలీవుడ్ డైరెక్టర్స్కి కంటి మీద కునుకు లేకుండాపోయింది. పుష్ప, ఆర్ఆర్ఆర్,
కేజీఎఫ్ 2 లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులు గడిచిన కూడా ఇంకా ఆ సినిమాల గురించే ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్లో సరైన సినిమాలు రాకపోవడంతో టాలీవుడ్ సినిమాల ఎఫెక్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీపై పడుతుంది.
సౌత్ సినిమానే గొప్ప
Read more: `బింబిసార` ఈవెంట్లో ఎన్టీఆర్ ధరించిన టీ షర్ట్ ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
సౌత్ సినిమాల గురించి ఏదో ఈ రోజుల్లో ప్రముఖ సెలబ్రెటీలు కామెంట్స్ చేయడం సాధారణంగా మారింది. తాజాగా బాలీవుడ్ టాప్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంకోసారి సౌత్ సినిమాలపై కామెంట్స్ చేసాడు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూ లో కరణ్ మాట్లాడుతూ “ప్రస్తుత కాలంలో ప్రేక్షకులను థియేటర్స్కి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి మాత్రమే ప్రేక్షకులు విజయ ఢంకా మోగిస్తున్నారు. బాలీవుడ్ లో విడుదల అయిన గంగూబాయి కతీయావాడి, భూల్ భూలయ్య 2 సినిమాలు 100 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించాయి. జూన్ లో విడుదల అయిన ‘జూగ్ జుగ్ జియో’ మంచి విజయం సాధించింది.
Read more: NBK 107: ఆ హీరోయిన్ వద్దు బాబోయ్ అంటున్న బాలయ్య ఫ్యాన్స్?!
టాలీవుడ్ ముందు దిగదుడుపే
Read more: Entertainment News: ఇన్స్టాలో అనుష్క ఫాలో అవుతున్న ఇద్దరే ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా?
కానీ టాలీవుడ్ సినిమా విజయాలు మన బాలీవుడ్ విజయాలను డామినేట్ చేస్తున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 లాంటి సినిమా విజయాలు బాలీవుడ్ విజయాలు కనపడకుండా చేస్తున్నాయి. కానీ త్వరలోనే ఆ పరిస్థితులు మారతాయి. ఆమీర్ ఖాన్, సల్మాన్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ హీరోలు నటించిన లాల్ సింగ్ చడ్డా, బ్రహ్మ స్త్ర, రక్షాబంధన్ సినిమాలు త్వరలోనే రిలీస్ అయ్యి విజయం సాధించి బాలీవుడ్ కి పూర్వ వైభవమ్ తీసుకొచ్చి పెడతాయి ” అని కరణ్ అన్నారు.