ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. వయసు ఎక్కువ కావడంతో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకినట్లు వార్తలు రావడంతో పాటు చికిత్స చేసే టైంలో ఆరోగ్యం విషమించిందని వార్తలు రావటంతో దేశవ్యాప్తంగా అందరి లో కలవరం మొదలైంది. ఒక్కసారిగా ఆయన అభిమానులు మరియు సంగీత ప్రేమికులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా సాక్షిగా కామెంట్లు పెడుతూ ఎందరో ప్రార్థనలు చేస్తూ త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నారు.
వెంటిలేటర్ పై ప్లాస్మా చికిత్స తీసుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంలో మార్పు వచ్చినట్లు నిలకడగా ఉన్నట్లు ఆయన కొడుకు ఎస్.పి చరణ్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానులు బాలు ఇస్ బ్యాక్, హమ్మయ్య భగవంతునికి చేసిన ప్రార్థనలు ఫలించాయి అని అంటున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం చాలావరకు కోలుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
మరోపక్క ఎస్పీ బాలసుబ్రమణ్యం ని తమిళ ఆరోగ్యశాఖ మంత్రి పరామర్శించారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం తమిళనాడు ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. మరో రెండు రోజుల పాటు వెంటిలేటర్ పై ఎస్పీ బాలసుబ్రమణ్యం ని వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచాలని తర్వాత డిశ్చార్జ్ చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.