లెజెండరీ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5వ తారీఖున కరోనా పాజిటివ్ తో చెన్నైలో ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ లో జాయిన్ ఇవ్వటం తెలిసిందే. దెబ్బకు ఈ వార్తతో అభిమానులు మరియు సినిమా ప్రముఖులు అదే విధంగా ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. బాలు వయసు మీదపడటంతో త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఆయన కోసం పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో బాల సుబ్రహ్మణ్యం కరోనా నుండి కోలుకోవడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీకు కరోనా నెగిటివ్ రావటంతో బాల సుబ్రహ్మణ్యం తిరిగి వచ్చేస్తారని అందరూ భావించారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా బాలసుబ్రహ్మణ్యం త్వరలో మన మధ్యలోకి రాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటనలు చేశారు.
కానీ ఇంతలోనే కరోనా చికిత్స తీసుకుంటున్నా సందర్భంలో బాలు లంగ్స్ చాలావరకు విషమించడంతో పాటు బ్రెయిన్ డెడ్ కావటంతో ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ కి చెందిన పది మంది స్పెషలిస్ట్ వైద్య నిపుణులతో ప్రత్యేకమైన చికిత్స అందించినా గాని లాభం లేకుండా పోవడంతో ఆయన మరణించడం జరిగిందట. కరోనా నుంచి కోలుకున్న గాని…లంగ్స్ చాలావరకు దెబ్బ తినడంతో పాటు వయసు మీదపడటంతో బ్రెయిన్ డెడ్ కావడంతో చివర్లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా గాని బాలసుబ్రహ్మణ్యం ప్రాణాన్ని కాపాడలేకపోయినటు అయింది.
దీంతో ఆయన మరణాన్ని సెప్టెంబర్ 25 వ తారీకు 1:04 నాలుగు నిమిషాలకు చనిపోయినట్లు ఆయన కుమారుడు సాయి చరణ్ అధికారికంగా ప్రకటించారు. బాలసుబ్రహ్మణ్యం చనిపోవడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోపక్క ఈ వార్త తెలుసుకుని లెజెండరీ గాన గాంధర్వం ఇక లేరు అని సినిమా ఇండస్ట్రీతో పాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. భారతదేశ సినీ ప్రముఖులంతా బాలు మరణ వార్త కు శోకసంద్రంలో మునిగిపోయారు.