వందే భారత్ మిషన్ కింద 19 ఫ్లైట్స్ నడుపుతోంది ప్రముఖ విమానాయాన సంస్థ స్పైస్ జెట్. ఇందులో భాగంగా స్పైస్ జెట్ తన ప్రయాణికుల కోసం మంచి ఆఫర్స్ తో ముందుకొచ్చింది. కరోనా సమయంలో తీసుకొచ్చిన పాలసీలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెప్పాలి. కోవిడ్ 19 ఇన్సురెన్స్ సర్వీసులతో తన ప్రయాణికులకు ఆఫర్ ఇస్తోంది. తక్కువ ప్రీమియంతో ఆకర్షణీయమైన భీమా మొత్తాన్ని పొందే ఆఫర్స్ ప్రవేశపెట్టింది. స్పైస్ జెట్ లో ప్రయాణించాలని అనుకునేవారికి ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం మొత్తం రూ.443 నుంచి ప్రారంభమవుతుంది.
గరిష్టంగా ప్రీమియం రూ.1564 వరకూ ఉంటుంది. రూ.50వేల నుంచి రూ.3 లక్షల వరూ బీమా పాలసీ పొందవచ్చు. స్పైస్ జెట్ ప్రవేశపెట్టిన కోవిడ్ 19 ఇన్సురెన్స్ ఆఫర్ ఆప్షనల్ అని కంపెనీ ప్రకటించింది. ప్రయాణికులకు ఇష్టమైతేనే ప్రయాణికులు తీసుకోవచ్చు. స్పైస్ జెట్ ఈ సేవలను డిజిట్ ఇన్సురెన్స్ సంస్థతో కలిసి అందించనుంది. అన్ని పాలసీల్లానే దీంతో కూడా హాస్పిటల్ ఖర్చులకు కవరేజ్ వస్తుంది. రూమ్, ఐసీయూ రెంట్ కు కూడా ఎలాంటి పరిమితులు ఉండవు. బీమా మొత్తంలోనే రూమ్ రెంట్, ఐసీయూ చార్జీలు కట్టొచ్చు.