Sreenu Vaitla: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక టైంలో డైరెక్టర్ శ్రీనువైట్ల తో సినిమా చేయాలంటే స్టార్ హీరోలు లైన్ కట్టేవారు. అప్పట్లో శ్రీనువైట్ల కి మంచి డిమాండ్ ఉండేది. పూర్తి వినోదాత్మక చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడమే కాక కలెక్షన్లు కొల్లగొట్టాడు. ముఖ్యంగా తన సినిమాలో సెకండాఫ్ పూర్తిగా బ్రహ్మానందంపై డిపెండ్ చేసి .. వన్ మ్యాన్ షో తరహాలో .. కుర్చీలో కూర్చునే ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్వించే రీతిలో శ్రీను వైట్ల సినిమాలు తీసే వాళ్ళు.
ఎంతటి స్టార్ హీరోతో సినిమా చేసిన సెకండాఫ్ పూర్తిగా మాత్రం కామెడీ పై ముఖ్యంగా బ్రహ్మానందం పై ఆధారపడి సినిమా మొత్తం రన్ అవుతూ ఉండేది. ఇదే లైన్ తో మహేష్ బాబుకి దూకుడుతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అదే రీతిలో రామ్, విష్ణుకి కూడా మంచి విజయాలు అందించడం జరిగింది. ఆ తర్వాత వరుస ప్లాపులు శ్రీను ని పలకరించాయి దెబ్బకి .. శ్రీను వైట్ల తో సినిమా అంటే స్టార్ హీరోలు వెనక్కితగ్గే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ పరిస్థితి రావడానికి గల కారణం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల తన మనసులో మాట బయటపెట్టారు.
Read More: Mahesh Babu: మహేష్ బాబు తో మరోసారి నటించాలని ఉంది అంటున్న బాలీవుడ్ భామ..!!
కామెడీ తరహాలో సినిమాలు చేస్తున్న సమయంలో అంతా ఒకే రకంగా సినిమాలు ఉన్నాయి శ్రీనువైట్ల సెకండాఫ్ మొత్తం కామెడీతో లాగిన్చేస్తున్నారు అనే టాక్ అప్పట్లో వచ్చింది. దీంతో కొత్తగా చేయాలనే ఉద్దేశంతో సినిమాలు చాలా వెరైటీ సబ్జెక్టులను ఎంచుకుని పూర్తిగా నా స్టైల్ మార్చుకొని సినిమాలు చేయటంతో వరుస ఫ్లాపులు పలకరించాయి. దీంతో అప్పుడు నాకు అర్థమైంది కొత్తదనం ట్రై చేయడం పెద్ద పొరపాటు .. కెరీర్లో అలా చేయడం వల్ల ఈ రీతిగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక అలా జరగదు అంటూ శ్రీను వైట్ల ఇటీవల తెలిపారు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ‘డి అండ్ డి’ సినిమా చేస్తున్నారు.