మీ టూ ఉద్యమంతో పాటు శ్రీరెడ్డి వ్యవహారం తదితర విషయాలపై అప్పట్లో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ప్యానల్ ఏర్పాటు అంగీకారం తెలిపింది. ఇప్పుడు ప్యానల్ ఏర్పాటుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. సుప్రియ, ఝాన్సీ, నందినీ రెడ్డిలను ఈ ప్యానల్ కమిటీ సభ్యులుగా నియమించింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మిలతో ఈ కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాతదర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. రాంమోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు. మహిళలు తమకు వేధింపులు ఎదురైతే ఈ కమిటీకి తెలియజేయవచ్చు.
శ్రీరెడ్డి స్పందన:
తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసి ప్యానల్ను నియమించడం పట్ల శ్రీరెడ్డి తన సంతోషాన్ని ఫేస్బుక్ ద్వారా వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తన కల సాకారమైందని.. హైదరాబాదీగా గర్వంగా ఉందని అన్నారు. తన పోరాటానికి అద్భుతమైన ఫలితం రావడంలో సాయపడిన అపూర్వ సహా ప్రతి ఒక్కరికీ శ్రీరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
previous post
next post