ఈ ఏడాది `బ్రోచేవారెవరురా` సినిమాతో సక్సెస్ అందుకున్నాడు హీరో శ్రీవిష్ణు. కొత్త కాన్సెప్ట్స్, దర్శకులతో సినిమాలు చేయడానికి ఇష్టపడే శ్రీవిష్ణు ఓ డెబ్యూ డైరెక్టర్తో కలిసి సినిమా చేయబోతున్నాడు. వివరాల్లోకెళ్తే దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వ శాఖలో పనిచేసిన దర్శకుడు హాసిత్ గోలి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈ ఏడాది చివరలోనే చిత్రీకరణను ప్రారంభం కానుంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
previous post
next post