Acharya-Susmitha: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర టీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ – యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. అయితే ఆచార్య ప్రీ రిలీజ్ వేదకను చిరూ పెద్ద కుమార్తె సుస్మిత తన సినిమా కోసం వాడేసుకుంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుష్మితర ప్రస్తుతం తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై `శ్రీదేవి శోభన్ బాబు` అనే సినిమాను నిర్మిస్తోంది. ఇందులో సంతోష్ శోభన్ హీగా నటించగా.. గౌరి జి.కిషన్ హీరోయిన్గా నటించింది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించగా.. కమ్రన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చాడు.
ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన ‘శ్రీదేవి శోభన్ బాబు’ టీజర్కు మాంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ట్రైలర్ను `ఆచార్య` ప్రీ రిలీజ్ పంక్షన్లో లాంఛ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర టీమ్ కొద్ది సేపటి క్రితమే అధికారికంగా అనౌన్స్ చేసింది. ఏదేమైనా ఆచార్య పంక్షన్లో శ్రీదేవి శోభన్ బాబు ట్రైలర్ను వదిలితే.. సంతోష్ సినిమాపై మంచి బజ్ ఏర్పడటం ఖాయం.