Jahnavi Kapoor: భారతీయ చలనచిత్ర రంగంలో దివంగత హీరోయిన్ శ్రీదేవికి తిరుగులేని క్రేజ్ సంపాదించింది. కానీ దురదృష్టవశాత్తు 2018లో మరణించడం జరిగింది. అయితే ఆమె వారసురాలిగా జాహ్నవి కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో జాహ్నవి కపూర్ అనేక సినిమాలు చేస్తూ ఉంది. శ్రీదేవి చనిపోయిన 2018వ సంవత్సరంలోనే జాహ్నవి కపూర్ మొదటి సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. నటన పరంగా ఇంకా గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగైదు సంవత్సరాల నుండి భారతీయ చలన చిత్ర రంగంలో దక్షిణాది సినిమాలు అనేక రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
హిందీ సినిమాలు అస్సలు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. అందులోనూ మరి ముఖ్యంగా తెలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధిస్తూ ఉన్నాయి. బాహుబలి, RRR, పుష్ప, కార్తికేయ 2 ఇంకా పలు సినిమాలు హిందీలో సత్తా చాటాయి. ఈ పరిణామంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు హీరోలు దక్షిణాది దర్శకులతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా హీరోయిన్ జాహ్నవి కపూర్ కూడా… మంచి గ్రాండ్ ఎంట్రీ ఇవటానికి ఎప్పటినుండో ప్లాన్ చేస్తూ ఉంది. గతంలో తనకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని తెలియజేసింది. అయితే ఇప్పుడు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా తెలుగులో ఫస్ట్ టైం జాహ్నవి కపూర్ ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నెలలోనే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. సరిగ్గా తన తల్లి మరణించిన ఫిబ్రవరి 24వ తారీఖు నాడు.. తెలుగులో జాహ్నవి కపూర్ ఎంట్రీ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. తెలుగులో శ్రీదేవి ఎన్టీఆర్ తరం ఇంకా చిరంజీవి తరం హీరోలు అందరితో నటించడం జరిగింది. మరి ఇప్పుడు ఆమె కుమార్తె జాహ్నవి కపూర్ .. తన ఫస్ట్ సినిమా తారక్ తో తెలుగులో ఎంట్రీకి సిద్ధం కావడం విశేషం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!