నటి శ్రియా శరణ్కు తృటిలో ప్రమాదం తప్పింది. శ్రియా శరణ్ ఒకప్పుడు మన దగ్గర టాప్ హీరోయిన్. ఇప్పుడు రష్యన్ని వివాహం చేసుకుని సెటిలైంది. అయినా ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. తమిళంలో ఆమె విమల్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కేరళలో జరిగింది. అక్కడి సంగతులను గురించి దర్శకుడు మాదేష్ వివరిస్తూ శ్రియకు తృటిలో ప్రమాదం ఎలా తప్పిందో వివరించారు. ఆయన మాట్లాడుతూ “ఇటీవల మేం కేరళలో ఓ సెట్ వేశాం. అక్కడ ఎక్కువ భాగాన్ని చిత్రీకరించాం. కానీ ఉన్నట్టుండి వచ్చిన వరదల్లో మా సెట్ పూర్తిగా కొట్టుకుపోయింది. థాంక్ గాడ్. అంతకు ముందే మేం అక్కడి నుంచి బయటపడ్డాం. లేకుంటే ఆ ఇంట్లో శ్రియగారిని పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఆమె మీదే మేం ఆఖరి రోజు కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మళ్లీ ప్యాచ్ వర్క్ కోసం వెళ్దామని అనుకున్నాం. వేరే కారణాల వల్ల మేం వెళ్లలేదు. ఒకవేళ వెళ్లినా, విమల్, శ్రియా ఇద్దరూ ప్రమాదంలో పడేవారే. భగవంతుడి దయ వల్ల ప్రమాదం తృటిలో తప్పింది“ అని చెప్పారు.
previous post
next post