SS Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. బాహుబలి 2, RRR రెండు సినిమాలు ఇండియాలో వరల్డ్ వైడ్ రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఇండియాలో ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించాయి. “బాహుబలి 2” ఇండియాలో అన్ని రికార్డులు బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక గత ఏడాది రిలీజ్ అయిన “RRR” అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మంచి పేరు క్రియేట్ చేసింది. అంతేకాదు ఇప్పటికే పలు అంతర్జాతీయ సినీ అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు రావటం తెలిసిందే. ఇదే సమయంలో ఆస్కార్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఇండియాలో చాలామంది సినిమా సెలబ్రిటీలు ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు “RRR” కి ఆస్కార్ రావాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి మరియు చరణ్ ఇంకా తారక్ కుటుంబాలు అమెరికాలో సందడి చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా హాలీవుడ్ లెజెండరీ సుప్రసిద్ధ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత అయిన స్టీవెన్ స్పిల్ బెర్గ్ నీ కలవడం జరిగింది.
ఈ సందర్భంగా రాజమౌళి దేవుడిని కలిసా అంటూ స్టీవెన్ స్పిల్ బెర్గ్ తో దిగిన ఫోటో పోస్ట్ చేసి కామెంట్ పెట్టారు. స్టీవెన్ స్పిల్ బెర్గ్ నీ ఆశ్చర్యంగా చూస్తూ రాజమౌళి దిగిన ఫోటో వైరల్ అవుతూ ఉంది. ఇదే సమయంలో ఎంఎం కీరవాణి కూడా ఫోటో దిగడం జరిగింది. రాజమౌళి, స్టీవెన్ స్పిల్ బెర్గ్, కీరవాణి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరోపక్క రాజమౌళి పనితనానికి హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ప్రముఖ నిర్మాణ సంస్థలు పనిచేయడానికి ముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా జక్కన్న తీస్తున్న సినిమాలు ఒకపక్క భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచడంతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి మంచి గుర్తింపు తీసుకొస్తున్నాయని చెప్పవచ్చు.