Stand Up Rahul: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నుంచి చివరిగా వచ్చిన అనుభవించు రాజా చిత్రం కూడా నిరాశే పరిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్ధేశంలో రాజ్ తరుణ్ `స్టాండప్ రాహుల్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి కలిసి నిర్మించారు. ఇందులో వర్ష బొళ్ళమ్మ హీరోయిన్గా నటించగా.. ఇంద్రజ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
2022 మార్చి 18న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. దాన్ని ప్రజెంట్ చేయడంలో విఫలం అయ్యాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే కొన్ని చిత్రాలు థియేటర్స్లో ఫ్లాప్ అయినా ఓటీటీలో హిట్ అవుతుంటారు.
ఈ నేపథ్యంలోనే స్టాండప్ రాహుల్ ఓటీటీలో విడదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా టీమ్ అధికారికంగా అనౌన్స్ కూడా చేసింది. `స్టాండప్ అనే వర్డ్ స్ట్రిక్ట్ పీటీ టీచర్ లాగా అనిపించినా.. మూవీ మాత్రం ఫన్ ఉంటది` అంటూ ఓ పోస్టర్ను వదిలారు.
#StandUp ane word strict PT teacher laga anipichina, movie matram fun untadi😉#StandUpRahulOnAHA premieres April 8, sit and watch it 😎@itsRajTarun @VarshaBollamma @standupsanto @sidhu_mudda @Nandu_Abbineni @bharath1985 @sonymusicsouth pic.twitter.com/fTN3MqvXg6
— ahavideoin (@ahavideoIN) March 29, 2022