NTR Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 12వ తారీకు వేసవి కానుకగా రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కావల్సి ఉండగా రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం RRR కోసం వాయిదా వేయడం జరిగింది. అయితే కరోనా కారణం గా RRR సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇటువంటి తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే మే నెలలో మహేష్ “సర్కార్ వారి పాట” సినిమా రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి మూడవ తారీఖు ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల జరిగాయి. సెంటిమెంట్ పరంగా గురువారం… మహేష్ ఈ సినిమా స్టార్ట్ చేశారు. మార్చి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ విషయంలో సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతుంది.
అదేమిటంటే “అలా వైకుంఠపురం లో” సినిమా తర్వాత. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం రాసిన స్క్రిప్ట్ తోనే మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఫుల్ మాస్ సబ్జెక్ట్ అని.. కొరటాలతో సినిమా కోసం త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్ వదులుకోవటం తో అదే సబ్జెక్టుతో.. మహేష్ తో త్రివిక్రమ్ కమిట్ అయినట్లు.. లేటెస్ట్ టాక్. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు ఖలేజా సినిమాలు కమర్షియల్ గా పెద్దగా బ్రేక్ ఇవ్వకపోయినా గాని… శాటిలైట్ పరంగా టెలివిజన్ రంగంలో రికార్డులు సృష్టించాయి. దీంతో మూడో సినిమా మహేష్ తో త్రివిక్రమ్ చేస్తూ ఉండటంతో ఈ సినిమా పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.